జర్నలిస్టుల పెండింగ్ సమస్యలపై 11 అంశాలు తో వినతి పత్రం
ఎన్ ఎ డి కొత్త రోడ్... జూన్ 16 విశాఖ నగర పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కు సింహాచలం అప్పన్న చందన ప్రసాదాన్ని సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి,నావెల్ డాక్ యార్డ్ కేటీబీ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులుగంట్ల శ్రీనుబాబు అందజేశారు. ఈ మేరకు సోమవారం విశాఖ విమానాశ్రయంలో చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలుసుకొని అత్యంత మహిమాన్వితమైన చందన ప్రసాదం శ్రీనుబాబు అందజేయగా ముఖ్యమంత్రి వెంటనే కళ్ళకు అద్దుకొని దానిని స్వీకరించారు. అలాగే జర్నలిస్టులుకు సంబందించిన 11 పెండింగ్ సమస్యలపై ముఖ్యమంత్రి కి శ్రీనుబాబు వినతిపత్రం అందజేశారు. ఇళ్ల స్థలాల సమస్యతోపాటు ప్రధానమైన 11 అంశాలు ఈ వినతిపత్రంలో పొందుపరిచినట్లు
శ్రీను బాబు ముఖ్య మంత్రి కి విపులంగా వివరించారు..వీటిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నట్లు శ్రీను బాబు తెలిపారు..
What's Your Reaction?