అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమా తండెల్ - దేశ భక్తితో కూడిన ప్రేమ కథ - హీరో నాగ చైతన్య
- విశాఖ పట్నం: ఫిబ్రవరి 7 తారీఖు విడుదల గీత ఆర్ట్స్ బ్యానర్ పై *అక్కినేని నాగ చైతన్య* హీరోగా, *సాయి పల్లవి* హీరోయిన్ గా, చందు మొండేటి దర్శకత్వంలో బన్నీ వాసు నిర్మించిన *తండెల్ చిత్రం ట్రైలర్ లాంచ్*.కార్యక్రమం మంగళ వారం *సాయంత్రం రామటాకిస్ హాల్లో* జరిగిం ది. ఈ కార్యక్రమంలో హీరో నాగచైతన్య తో పాటుగా టీం పాల్గొంది. ఈ సందర్భంగా హీరో నాగ చైతన్య మాట్లాడుతూ, శ్రీకాకుళం జిల్లా లో యధార్థంగా జరిగిన సంఘటనలు ఆధారంగా ఈ సినిమా తీశామన్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 7 న విడుదల కానుంది అన్నారు. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుఎం దున్నారు. హీరోయిన్ సాయి పల్లవి నటన ఈ సినిమాకి హైలెట్ అవుతుంది అన్నారు. దేవి శ్రీ ప్రసాద్ వీనుల విందుగా సంగీతం అందించారు అని ప్రశంసించారు. ఇది దేశ భక్తితో కూడిన ప్రేమ కథ అని గుర్తు చేశారు. విశాఖ జిల్లా కోర్టు పరిసరాల్లో చిత్ర షూటింగ్ జరిగింది అన్నారు. విశాఖలో ట్రైలర్ లాంచ్ ఆనందంగా ఉంది. మత్స్యకారుల జీవన విధానం అధ్యయనం చేశాను. విశాఖ జాలరిపేటలో కూడా తిరిగాను. తన లైఫ్ లో నిజమైన తండెల్ అరవింద్ అన్నారు. ఏ సినిమా అయినా విశాఖలో హిట్ అయితే సినిమా హిట్ అయినట్టే. విశాఖ అమ్మాయ
చిత్ర రచయిత కార్తీక్ మాట్లాడుతూ, దర్శకుడు చందు అద్భుతంగా తెర కేక్కించారు అన్నారు.
అంతకుముందు
బుజ్జి తల్లి, ఎంతెంత దూరం, పాటలు ప్రదర్శించారు.
ఈ కార్యక్రమంలో Exicutive ప్రొడ్యూసర్ సత్య, డిజిటల్ పార్టనర్ మార్నింగ్ షో బృందం
అక్కినేని అభిమానులు, రామా థియేటర్ మేనేజర్ ఉమా మహేశ్వర రావు పాల్గొన్నారు.
What's Your Reaction?